ములుగు, 2026-07-27
ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి నిబంధనను కఠినతరం చేస్తూ, నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ప్రజల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన 'ఎన్నో ఎలైవ్ ఎరైవ్' కార్యక్రమాలపై అవగాహన కల్పించినా, ప్రజల్లో మార్పు కనిపించకపోవడంతో జరిమానాల ద్వారా క్రమశిక్షణ తీసుకురావాలని యోచిస్తున్నారు.
ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి నిబంధనను కఠినతరం చేశారు. హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధించనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా, రాష్ట్రంలో ద్విచక్ర వాహన ప్రమాదాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం 'ఎన్నో ఎలైవ్ ఎరైవ్' వంటి కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అవగాహన సదస్సులు నిర్వహించినా ప్రజల్లో మార్పు రాకపోవడంతో, జరిమానాల ద్వారా భయాన్ని కల్పించి, హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయాలనే ఉద్దేశ్యంతో ఈ చర్యలు చేపడుతున్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని శివాలయం వద్ద ప్రధాన రహదారిపై పోలీసులు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలను చూపించాలని సూచించారు. చిన్నపిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సుమారు 60 వాహనాలకు ఫైన్లు విధించినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వెంకటాపురం ఎస్ఐ తిరుపతిరెడ్డి, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.










